ఏపీ బీజేపీలో మరో కలవరం మొదలయింది.ఇప్పటికే చాలా సార్లు అధ్యక్షుడు సోము వీర్రాజుకు, ఇతర వర్గాలకు పడట్లేదనే భావన మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది.
సోము తన వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడంతో మిగతా వారు ఆయన మీద కొంచెం అసహనంగా ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కేవలం సోము విషయంలో జరిగిన ఓ ఘటన ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
కేవలం సోముకు మాత్రమే కేంద్ర నాయకత్వం అనుకూలంగా ఓ లెటర్ను పంపించింది.
చాలా రోజులుగా సోము చేతికి పూర్తి అధికారాలను ఇచ్చేసింది కేంద్ర నాయకత్వం.
రాష్ట్రంలో ఎవరు ఏం మాట్లాడాలన్నా సరే తన పర్మిషన్ ఉండాలనేది సోము ఆదేశం.అయితే చాలామంది ఆయన్ను అడగకుండానే ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రతిపక్ష పార్టీలపై చాలా సార్లు విమర్శలు చేశారు.
దీంతో సోము కొందరిపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు.ఇలా చాలామందిని ఆయన కంట్రోల్ చేయడంతో.
కొందరు గ్రూపుగా ఏర్పడి కేంద్ర నాయకత్వానికి ప్రతిపాదనలు పంపారు.సోము తమ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలని కోరారు.
ఇక ఈ అంశంపై కూలంకుశంగా చర్చించిన కేంద్ర నాయకత్వం.సోముకు అనుకూలంగా వ్యవహరించింది.ఎవరు ఎలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు.ఎవరు చర్చలకు వెళ్తున్నారు అనే అంశాలపై ఆరా తీశారు.ఎవరు ఏం చేసినా సరే సోము అనుమతి తీసుకోవాలంటూ చెప్పేశారు.అంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే ఫుల్ పవర్స్ మాత్రం సోముకే ఇచ్చారు కేంద్ర పెద్దలు.రాబోయే రోజుల్లో సోముకు తిరుగుండదని నిపుణులు అంటున్నారు.ఇక పార్టీ నుంచి కూడా ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం కేవలం సోముకే దక్కిందని చెబుతున్నారు.అంటే రాబోయే రోజుల్లో పార్టీని ఒక్కరి చేతిలోనే పెట్టి బలపరుచుకోవాలని కేంద్ర నాయకత్వం చూస్తున్నట్టు ఉంది.