తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది.ఎవ్వరూ కనీసం ఊహించని విధంగా షర్మిల తాను పార్టీ పెడుతున్నట్టు ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
తరువాత జిల్లాల వారీ నేతలతో సమీక్ష జరపడం, ఇలా షర్మిల క్షేత్ర స్థాయి నాయకులతో పార్టీ ఏర్పాటు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు.అయితే ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టిన షర్మిల అక్కడ పటిష్టంగా తయారయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
అయితే తాజాగా ఖమ్మం పాలేరు నుండి షర్మిల పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది.అయితే త్వరలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఖమ్మంలో షర్మిల ఎంట్రీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఫలితాలపై ప్రభావం చూపనుంది.
అయితే ఖమ్మంలో షర్మిలకు పూర్తి స్థాయి పట్టు ఉండడంతో అక్కడ బీజేపీ షర్మిలపై అసత్య ప్రచారం చేస్తే కొన్ని కొన్ని సందర్భాలలో ప్రజలు తిరగబడే అవకాశం ఉంది.అయితే మున్సిపల్ ఎన్నికల వరకు పార్టీ ఏర్పాట్లు పూర్తయి పట్టాలెక్కితే ఇక ఎన్నికల రణరంగంగా మారే అవకాశం ఉంది.
షర్మిల పార్టీని ఎవరు ఎంతవరకు ఆదరిస్తారో తెలియాలంటే ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే బయటపడుతుంది.అయితే ప్రజలు ఆదరిస్తారని నమ్మకం ఉందని షర్మిల నొక్కి వక్కాణిస్తున్న విషయం మనకు తెలిసిందే.