ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా పుష్ప 2.టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు మేకర్స్ పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారు.2021 ఏడాది పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది.
అయితే ఇది వచ్చి ఏడాది పైగానే అవుతున్న ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.ఇక తాజాగా వారం క్రితం ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యింది.వైజాగ్ లో పుష్ప 2 షూట్ స్టార్ట్ అయ్యింది.”పుష్ప ది రూల్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ లో అల్లు అర్జున్ కూడా పాల్గొంటున్నాడు.ఇప్పటికే టీమ్ మొత్తం వైజాగ్ చేరుకున్నారు.
ఈ షెడ్యూల్ వైజాగ్ లో 10 రోజుల పాటు సాగనుందని తెలుస్తుంది.
ఈ షూటింగ్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నాడు సుకుమార్..
ఇక రెండు రోజుల నుండి ఈ సినిమా షూట్ గురించి ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో నటించిన విషయం విదితమే.
మరి ఈమె పాత్ర గురించి మరో అప్డేట్ తెలుస్తుంది.బన్నీ మీద సీన్స్ ప్రెజెంట్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా సెట్స్ లో రష్మిక వచ్చే నెల నుండి జాయిన్ కాబోతుంది అని టాక్.శ్రీవల్లి పాత్రలో జాయిన్ కానున్నట్టుగా తెలుస్తుంది.
మొదటి సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే.మరి పార్ట్ 2 లో వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి.
ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.