వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ ఎంపీ త్వరలోనే ఎట్టకేలకు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారంట.ఇంతకు ఆయనెవరో గుర్తొచ్చిందా.
అదేనండి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు.వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచినా.
ఆ తర్వాత ఆయన రెబల్ ఎంపీగా మారిపోయారు.ఈయన రాజీనామా చేయాలంటూ వైసీపీ కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది.
కానీ ఆయన మాత్రం రాజీనామా చేసేది లేదంటూ ఇన్ని రోజులు చెప్పుకుంటూ వస్తున్నారు.కానీ ఇప్పుడు వైసీపీ కోరికను నెరవేర్చేందుకు రెడీ అవుతున్నారంట.
కాకపోతే తనకు అనుకూలంగా ఉన్న సమయంలోనే రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారంట.వైసీపీ కోరినప్పుడు చేస్తే తనకు నష్టం జరుగుతుందని భావించిన ఎంపీ రఘురామ.ఈ సమ్మర్కు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది.అప్పటికి జగన్ సీఎం అయి కూడా మూడేండ్లు నిండుతాయి కాబట్టి అదే కరెక్టు టైమ్ అని సమ్మర్ లో రాజకీయ ప్రకంపనలు రేపేందుకు రెడీ అవుతున్నారు.
కాగా అందరూ అనుకుంటున్నట్టు గానే ఆయన బీజేపీ నుంచి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.మరి వైసీపీ నుంచి ఎవరు అనే సందేహాలు కూడా వస్తున్నాయి.
ఇప్పటికే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి హామీ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.అయితే ఇక్కడ వైసీపీ నుంచి క్షత్రీయ సామాజిక వర్గం కాకుండా ఇతర వర్గాల వారికి టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు.
కానీ ఇక్కడ గెలవాలంటే క్షత్రీయ, కాపు సామాజిక వర్గాల ఓట్లే కీలకం.ఇక బీజేపీకి జనసేన సపోర్టు చేస్తే గనక క్షత్రీయులు, కాపులు కలిసి బీజేపీకి ఓటేసే ఛాన్స్ ఉంటుంది.
అంటే అది వైసీపీకి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.ఇప్పటికే ఈ రెండు వర్గాలు వైసీపీ మీద కోపంగా ఉన్నాయి.కాబట్టి వైసీపీకి ఈ ఉప ఎన్నిక పెద్ద సవాలే అని చెప్పొచ్చు.