రామజన్మ భూమి ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాల్ దాస్తో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ హోం క్వారంటైన్లోకి వెళ్తారా అంటూ శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ కొవిడ్ నిబంధనలు ఎందుకు పాటించడం లేదని సంజయ్ రౌత్ నిలదీశారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం తమ పార్టీ పత్రిక అయిన “సామ్నా”లో రోక్తోక్ అనే తన కాలమ్లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరిగిన రామ మందిర భూమి పూజ కార్యక్రమంలో మహంత నృత్య గోపాల్ దాస్తో కలిసి ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.
నృత్య గోపాల్ దాస్ మాస్క్ పెట్టుకోలేదు. ప్రధాని మోదీ భక్తితో గోపాల్ దాస్ చేతిని పట్టుకున్నారు.
అందుకే ఆయన కూడా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.
ఇక మరోవైపు భాబీజీ పాపడ్ తింటే కరోనా రాదన్న కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్పై కూడా సంజయ్ రౌత్ విమర్శలు చేశారు.
భారత్ భాబీజీ పాపడ్ దగ్గరే ఆగిపోయిందన్న ఆయన. రష్యా కరోనాకు వ్యాక్సిన్ను కూడా కనిపెట్టి ఆత్మ నిర్భరతను చూపిందన్నారు.మనం మాత్రం ఆత్మ నిర్భర భారత్పై ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటామని వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.కాగా, అయోధ్య భూమి పూజలో పాల్గొన్న నృత్య గోపాల్ దాస్కు ఆగస్టు 13న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
ప్రస్తుతం గోపాల్ దాస్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.