తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకొని బలపడడానికి వాడుకుంటోంది.అయితే తాజాగా భైంసా ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది.
అయితే అందులో ప్రభుత్వ వైఫల్యం లేకపోయినా దానిని అరికట్టడంలో విఫలమైందనేది బీజేపీ వాదన.అయితే ఆ ఘటనలో హిందువులపై దాడి జరిగిందని, హిందువులపై దాడి చేయాలనే కుట్రతోనే ఈ ఘటనకు ఆజ్యం పోసారని ఎంపీ అరవింద్, బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భైంసా ఘటనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం కేసీఆర్ భైంసాలో పర్యటన చేయకపోతే నేను భైంసాలో భరోసా యాత్ర చేస్తానని బండి సంజయ్ హెచ్చరించారు.
అయితే త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనను అక్కడ ఎన్నికల ప్రచారంలో ప్రభత్వానికి వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంది.హిందువులపై జరిగిన దాడి తెలంగాణ ప్రజలపై జరిగిన దాడిగా చిత్రీకరించి నాగార్జున సాగర్ ఎన్నికలో లబ్దిపొందే అవకాశం ఉంది.
మరి ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.భరోసా యాత్ర చేస్తానంటున్న బండి సంజయ్ ఒక వేళ నిజంగా భరోసా యాత్ర చేపడితే,శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఏది ఏమైనా భైంసా ఘటన రాజకీయంగా ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.