టాలీవుడ్ స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతగా ప్రాచుర్యం పొందిందో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈ షో టిఆర్పి రేటింగులు పరంగానే కాకుండా నిర్వాహకులు కూడా మంచి కాసుల పంట పండించింది.
అంతేగాక ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లు కూడా మంచి సినిమా అవకాశాలను సంపాదించుకుంటున్నారు.అయితే విజయవంతంగా 3 సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ రియాల్టీ షో నాలుగో సీజన్ వైపు అడుగులేస్తోంది.
అయితే ప్రస్తుతం బిగ్ బాస్ నాలుగో సీజన్ కి వ్యాఖ్యాత విషయానికి సంబంధించి కొంతమేర సందిగ్దత నెలకొంది.అయితే మొదటి బిగ్ బాస్ షో సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టువంటి జూనియర్ ఎన్టీఆర్ 4వ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు ఈ మధ్యకాలంలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, త్రివిక్రమ్ చిత్రాలతో బిజీగా ఉండటంతో మూడవ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి టాలీవుడ్ కింగ్ నాగార్జునే నాలుగోవ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.అంతేగాక ఈ విషయానికి సంబంధించి షో నిర్వాహకులు ఇప్పటికే నాగార్జునను సంప్రదించారట.
అయితే తొందర్లోనే షో నిర్వాహకులు ఈ వివరాలను తెలియజేయనున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో నాగార్జున ఎన్.ఐ.ఏ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.అలాగే బాలీవుడ్ లో బ్రహ్మాస్త్రా అనే భారీ బడ్జెట్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.