మోడీ మానియాతో దేశం ఊగిపోతుంది.ఒక్కొక్క రాష్ట్రాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ బీజేపీ దూసుకుపోతుంది.
నల్లధనంపై కన్నెర్రజేస్తాను అన్న మోడీ ఆప్రయత్నంలోనే వివిద దేశాలతో స్నేహ బాంధవ్యాన్ని ఏర్పరుచుకుంటున్నాడు.ఇంతవరకు బాగానే ఉంది.
ఇప్పుడు మోడీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న వాదన ఏంటి అంటే మోడీకి దమ్ము ఉంటే ముంబై పేలుళ్లకు కారణం అయి, అనేక మందిని పొట్టను పెట్టుకున్న దావూద్ ను భారతదేశానికి రప్పించి శిక్షించమని.ఇదిలా ఉండగానే దావూద్ మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి సంచలనం సృష్టిస్తుంది.
అసలు ఇప్పటివరకు ఒక్కణ్ణి పట్టుకోలేకపోతున్నారు అన్న వాదనకు దావూద్ మాటలే సమాధానం ఇస్తున్నాయి.ఆయన ఆ టేప్ లో మాట్లాడుతూ కొంచెం కరుగ్గా “తాను ఏ కోర్ట్ కు రాను అని, తనకు సంబందించినంతవరకు తానే కోర్ట్, తానే జడ్జ్” అని మాట్లాడిన మాటలు చూస్తుంటే దాదాపు 60ఏళ్లు పైబడిన దావూద్ ఎంత మొండి వాడో తెలుస్తుంది.
అయితే అసలు దావూద్ ను మోడి ప్రభుత్వం పట్టుకుందా? పాకిస్తాన్లోనే ఉన్నాడు అని తెలిసినా, ఆధారాలు ఉన్నా ఆ ప్రభుత్వం దావూద్ ను భారత్ కు అప్పగిస్తుందా అన్న వాదన బలంగా వినిపిస్తుంది.మరి ఏం జరుగుతుందో ఏమో కానీ, ఈ వాదనకు సమాధానం మాత్రం కాలమే నిర్ణయిస్తుంది అని సరిపెట్టుకోవటమే తప్ప మనం చేసేది ఏమీ లేదు.