ప్రస్తుతం తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఎంత సంచలనం సృష్టిస్తున్నాడో మనం చూస్తున్నాం.అయితే కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటూనే ఏవో విభేదాల వల్ల కేసీఆర్ కు బద్ద వ్యతిరేకిగా మారిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ మల్లన్న ఇప్పుడు కేసీఆర్ కే ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.
తనకంటూ సొంత మీడియా ఛానల్ ను ఏర్పాటు చేసుకొని కేసీఆర్ హామీలు, కేసీఆర్ ను రకరకాల అంశాలపై టార్గెట్ చేస్తూ కేసీఆర్ వ్యతిరేక వర్గాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్నాడు.ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వేయడంతో పట్టభద్రులు లక్ష పైగా ఓట్లు వేయడం జరిగింది.
ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సామాన్య జర్నలిస్ట్ కు అధికార అభ్యర్థికి ధీటుగా ఓట్లు వచ్చాయంటే, మల్లన్నకు ఉన్న క్రేజ్ ను మనం అర్థం చేసుకోవచ్చు.అయితే ఇప్పటివరకు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారని మల్లన్న ఇకపై పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారుతాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్తకంగా మారింది.
త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న పరిస్థితులలో ఒంటరిగా పోటీ చేస్తాడా లేదా ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తాడా అనేది త్వరలో చూడాల్సి ఉంది.ఏది ఏమైనా నాగార్జున సాగర్ ఎన్నిక రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.