మహేష్ బాబు సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ ఏడాది మరో సినిమాను తీసుకు వచ్చేందుకు మహేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తే వచ్చే ఏడాది వరకు ఆగాలి.
అందుకే మరో సినిమాను స్పీడ్ గా చేసి ఇదే ఏడాది రావాలని అనుకున్నాడు.
ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు ఈయన సినిమా ఈ ఏడాది ఉంటుందా అనే అనుమానాలు కలిగిస్తుంది.
ఎందుకు అంటే ఇప్పటి వరకు ఈయన సినిమా తర్వాత సినిమా ఎవరి దర్శకత్వంలో అనే విషయంలో క్లారిటీ రాలేదు.ప్రస్తుతం కథలు వింటున్న వాటిలో ఒకదానికి కమిట్ అవ్వడానికి కనీసం రెండు నెలలు పడుతుంది.
దానికి ఏమైనా మార్పులు చెబితే ఇంకా లెట్ అవుతుంది.కనుక సినిమా సమ్మర్ పూర్తి అయితే కానీ మొదలు అవ్వదు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ కు పదిమంది దర్శకులు కథలు చెప్పారట.వారిలో ఎవరు అయితే మహేష్ కు కమర్షియల్ హిట్ ఇస్తారో వారికి చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.మహేష్ బాబు కాస్త స్పీడ్ గా కథకు ఒకే చేస్తేనే ఈ ఏడాది సినిమా వచ్చే అవకాశం ఉంది.కానీ మహేష్ మాత్రం స్లో గా కనిపిస్తున్నాడు.
కనుక మహేష్ ఈ ఏడాదిలో వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు.