టాలీవుడ్ లో బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో కి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.ఇటీవలే ఈ బిగ్ బాస్ 3 సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకుని నాలుగో సీజన్ వైపు అడుగులు వేస్తోంది.
అయితే తాజాగా బిగ్ బాస్ నాలుగవ సీజన్ హోస్ట్ విషయంపై కొంత సందిగ్ధత నెలకొంది.తాజాగా ఈ నాలుగో సీజన్ లో వ్యాఖ్యాతగా ఇప్పటికే టాలీవుడ్ కింగ్ నాగార్జున ను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు మళ్లీ కొత్తగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వినిపిస్తోంది.అయితే ఇటీవలే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో హిట్ కొట్టడంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు మహేష్ బాబుని తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ 3 సీజన్ లో నాగార్జున ఇంతకుముందే వ్యవహరించాడు.అందువల్ల ఈసారి నాగార్జునని పక్కన బెట్టి మహేష్ బాబుని తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంది. ఈ వ్యాఖ్యాతల లిస్టులో అల్లు అర్జున్ పేరు కూడా వినిపిస్తోంది.అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఇప్పటికే కొత్త సినిమాని పట్టాలు ఎక్కిస్తున్నాడు.
దాంతో అల్లుఅర్జున్ వ్యాఖ్యాతగా వ్యవవహరించే అవకాశాలు లేకపోవడంతో ఎక్కువగా మహేష్ బాబు పేరే వినిపిస్తోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ గ్లామర్ క్వీన్ కియారా అద్వానీ నటిస్తోంది.