‘ప్రేమ కథా చిత్రమ్’తో ప్రేక్షకుల మన్నస్సులను దోచుకున్నారు సుధీర్బాబు మరియు నందిత.వీరిద్దరి కాంబినేషన్కు మంచి పేరు వచ్చింది.
ఆ సినిమా సక్సెస్ అవ్వడంలో వీరిద్దరి పాత్ర చాలా కీలకం.ఆ సినిమాలో వీరిద్దరి రొమాన్స్కు మంచి మార్కులు పడ్డాయి.
తాజాగా మరోసారి వీరిద్దరు కలిసి ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా రేపే విడుదలకు సిద్దంగా ఉంది.
ఈ సంవత్సరం చివర్లోనే విడుదల కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది.ఎట్టకేలకు రేపు విడుదల కాబోతుంది.
లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.‘ప్రేమకథా చిత్రం’ జంట నటించిన సినిమా అవ్వడంతో అంచనాలు ప్రేక్షకుల్లో భారీగా ఉన్నాయి.
మరి ఈ సక్సెస్ కాంబో మరో సక్సెస్ను అందుకుంటుందా అనేది రేపటి వరకు ఆగితే తేలిపోతుంది.ఈ సినిమాలో సుధీర్బాబు మూడు వైవిధ్య పాత్రల్లో కనిపించనున్నాడు.
ఇక హీరోయిన్ నందిత కూడా గత సినిమాల కంటే కూడా ఈ సినిమాలో మరింత గ్లామర్తో కనిపించనుందని చెబుతున్నారు.రానా, నాగచైతన్యలు ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.