త్వరలో తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఎన్నికల కమిషన్ ఇక ఈ ఎన్నికల అనంతరం నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ఇప్పటికే అధికార పక్షం, ప్రతిపక్షాలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.ఇటీవల బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి అక్కడ తన వ్యాఖ్యలతో కార్యకర్తలను రెచ్చగొట్టడంతో పోలీసులకు గాయాలయ్యాయి.
ఇక తాజాగా కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ సభలో కేసీఆర్ కు తమ సమస్యల పైన వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో వారు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.
ఇక సహనం కోల్పోయిన కేసీఆర్ వారిని కుక్కలని సంబోధించడం పెద్ద దుమారాన్ని రేపింది.ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకొని పెద్ద ఎత్తున కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లో కేసీఆర్ పై మరింత వ్యతిరేకత పెంచే విధంగా వ్యూహాలు రచిస్తోంది.
ఇక కాంగ్రెస్ విషయానికొస్తే రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ప్రజలను కలిసిన సందర్బంలో కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.ఏది ఏమైనా కేసీఆర్ వ్యాఖ్యలు టీఆర్ఎస్ గెలుపుకు కొంత గండి కొట్టే అవకాశం ఉందనే చెప్పవచ్చు.