ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 25 నాటికి ముగియనుంది.జూలైల 25 తర్వాత రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బీజేపీ కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది.రాష్ట్రపతి అభ్యర్థి విషయమై ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని సీఎంలు, ఎన్డీయేతర పార్టీల సీఎంలతో చర్చించేందుకు కొందరు కేంద్రమంత్రులకు బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.
దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా రాష్ట్రపతి ఎన్నిక గురించే జోరుగా చర్చ జరుగుతోంది.తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్లు కూడా రాష్ట్రపతి ఎన్నిక కోసమే జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిని ఓడించి విపక్షాల అభ్యర్ధి నెగ్గేలా కేసీఆర్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.అయితే ఇది తేలికైన పని కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే కేవలం మెజారిటీకి స్వల్ప ఓట్ల దూరంలో బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఉన్నాడని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఒకవేళ ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వం ఏపీలోని జగన్ సర్కారు సహాయం కోరుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వైసీపీ మద్దతు ఇస్తే బీజేపీ అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థిగా గెలవడం సులువు అవుతుందని పలువురు భావిస్తున్నారు.
దీంతో ఈ అంశంలో జగన్ కింగ్ మేకర్ కానున్నరని అర్ధం అవుతోంది.లోక్సభలో 22 ఎంపీల బలం వైసీపీకి ఉంది.అటు రాజ్యసభలోనూ వైసీపీ బలం పుంజుకుంది.
కానీ ఓ విషయం అంతుబట్టని వ్యవహారంలా మారింది.నిజానికి కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.మరి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో జగన్ కేసీఆర్ చెప్పినట్లు వ్యవహరిస్తారా లేదా బీజేపీకి మద్దతు ప్రకటిస్తారా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.ఒకవేళ మోదీ ప్రభుత్వానికి జగన్ ఫేస్ టర్నింగ్ ఇస్తే దేశ రాజకీయాల్లో కేసీఆర్ చెబుతున్నట్లు సంచలనం నమోదు అవుతుంది.
అందుకే రాష్ట్రపతి ఎన్నికను దృష్టిలో పెట్టుకుని జగన్ను బీజేపీ పువ్వులా చూసుకుంటోందని.వైసీపీ మీదే బీజేపీ కోటి ఆశలు పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.