ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ పార్టీ కి చాలా అంశాల్లోనే కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగిలాయి.ఇప్పటికే మనం చాలా మీడియాల్లో జగన్ సర్కార్ కు షాక్.
జగన్ ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసిన కోర్టు అని చదివాం.కానీ ఇక్కడ ఓ విషయం మాత్రం జగన్ సర్కార్ కు ఎక్కువ లాభించేలా కనిపిస్తోంది.
ఇప్పుడు ఇదే అంశం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.ఎలాగైనా సరే బీజేపీతో జట్టు కట్టాలని ఏపీలోని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి.2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ హవా బాగా నడిచింది.అందుకోసమే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా బీజేపీకి మిత్ర పక్షాల అవసరం రాలేదు.
కానీ 2024లో మాత్రం పరిస్థితి అలా ఉండదని ఇప్పటి నుంచే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఆ పార్టీకి ఇతర మిత్ర పక్షాలతో పొత్తులు తప్పవనే సంకేతాలు అందుతున్నట్లు వారు చెబుతున్నారు.
దేశ రాజకీయాల్లో ఈ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.కాబట్టి జగన్ సర్కార్ మద్దతు బీజేపీకి చాలా అవసరం పడే అవకాశం ఉందని అంటున్నారు.
త్వరలోనే ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల వేళ బీజేపీకి అనేక షాకులు తగులుతున్నాయి.
ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, క్యాబినేట్ మినిస్టర్లు ఒక్కొక్కరుగా పార్టీని విడుస్తున్నారు.
ఇటువంటి సమయంలో అక్కడ బీజేపీకి బంపర్ మెజార్టీ రావడం కష్టమే అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ ప్రభావం 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల మీద కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు.అదే జరిగితే కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి 2024లో మిత్రపక్షాల అవసరం వస్తుందని, అప్పుడు ఎంతో నమ్మకంగా ఉండే జగన్ పార్టీ వైపు బీజేపీ చూసే అవకాశం ఉందని చెబుతున్నారు.