నేడు జరగనున్న భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కి వరుణుడు అడ్డురాకూడదని అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.పంజాబ్ లోని మొహాలీలో రాత్రి 7:30 గంటల నుంచి మ్యాచ్ జరుగనుండగా, ఈ ప్రాంతంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అభిమానులు వరుణ పూజలు చేశారు.ఈ పోరులో తప్పనిసరిగా గెలిస్తేనే ఇండియా సెమీఫైనల్ కు వెళుతుంది.ఒకవేళ మ్యాచ్ రద్దయి చెరో పాయింట్ ను ప్రకటించిన పక్షంలో మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా ఆస్ట్రేలియా తదుపరి రౌండుకు వెళ్లిపోతుంది.
అప్పుడు ఇండియా కథ ముగిసినట్టే.
.