తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయ యుద్దం కొనసాగుతున్న విషయం మనం చూస్తున్నాం.అయితే హుజూరాబాద్ లో గత ఎన్నికల వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారిపోయిన పరిస్థితి ఉంది.
అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి ఈటెల రాజేందర్ కు, కాంగ్రెస్ నుండి పాడి కౌశిక్ రెడ్డికి మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే .అయితే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన ఈటెల రాజేందర్ కు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారనే చెప్పవచ్చు.దాదాపుగా 60వేల ఓట్లను పొందారు పాడి కౌశిక్ రెడ్డి.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ తో విభేదించి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.ఇక మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.
అయితే టీఆర్ఎస్ కు కంచుకోట అయిన హుజూరాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డికి సహకరిస్తారా అనే విషయం రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.మరి భవిష్యత్ పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.