తెలంగాణలో రాజకీయం హాట్ హాట్ గా నడుస్తున్న విషయం తెలిసిందే.మాజీ మంత్రి ఈటెల వేస్తున్న ఒక్కో అడుగు టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.
ఇప్పటికే బీజేపీ లో చేరికకు సిద్దమైన తరుణంలో ఈటెల బలమైన బీసీ నేత కాబట్టి బీజేపీ ఆధ్వర్యంలో ఈటెల బలపడితే రాష్ట్ర వ్యాప్తంగా చిక్కులు వచ్చే అవకాశం ఉంది.అయితే రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పేరున్న ఈటెల రాజేందర్ ను కేసీఆర్ భర్తరఫ్ చేసిన తరువాత కొంత భర్తరఫ్ అయిన పరిస్థితులలో కొంత మేర ఈటెల పేరు మసక బారినా పెద్ద ఎత్తున ఈటెలకు సామూభూతి వ్యక్తమైంది.
అయితే ఈటెల నియోజకవర్గంలో కేసీఆర్ రకరకాల వ్యూహాలు వేసి ఈటెలకు చెక్ పెడదామని ప్రయత్నించినా కేసీఆర్ పాచికలు పారలేదు.
అయితే ఇప్పుడు తాజాగా జేపీ నడ్డాను ఈటెల రాజేందర్ కలిసిన విషయం తెలిసిందే.
బీజేపీలో చేరికతో ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిస్థితుల మధ్య మసకబారిన రాజేందర్ పేరు బీజేపీలో చేరడంతో మరల ఈటెలకు పూర్వ వైభవం వస్తుందో లేదో చూడాల్సి ఉంది.ఎందుకంటే ఈటెలపై తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో ఈటెల వేసే ప్రతి అడుగును కెసీఆర్ పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈటెల ఎటువంటి వ్యూహాలు రచిస్తాడో చూడాల్సి ఉంది.