యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే ఎలాంటి క్రేజ్ను దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటేందుకు డార్లింగ్ రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని చిత్ర వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు.కాగా ఈ సినిమాలో ప్రభాస్ డ్యుయెల్ రోల్లో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో ఎప్పటినుండో టాక్ వినిపిస్తోంది.
అటు హీరోయిన్ పూజా హెగ్డే కూడా డ్యుయెల్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.పూర్వజన్మ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే ఇటీవల రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ చూస్తే, ఈ సినిమాను పూర్తిగా రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, ఈ రెండు జన్మల కాన్సెప్టుతో ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందా అనే సందేహం కలుగుతోంది. ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన డ్యుయెల్ రోల్ చిత్రాల్లో కేవలం బాహుబలి మాత్రమే విజయాన్ని అందుకుంది.
ఇక ఇప్పుడు రాధేశ్యామ్లో కూడా అదే తరహా సెంటిమెంట్ ఉండనుండటంతో, బాహుబలి రేంజ్లో కాకపోయినా ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ కొట్టాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.అయితే ఒకవేళ రాధేశ్యామ్ చిత్రం కూడా రొటీన్ లవ్ స్టోరీ కాన్సెప్ట్తో వస్తే, ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందనే అంశం ఆందోళన కలిగిస్తుంది.
మరి ఈ సినిమాలోని డ్యుయెల్ రోల్స్ రాధేశ్యామ్ను గట్టెక్కించేందుకు ఉపయోగపడతాయా లేదా అనేది సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.మరి రాధేశ్యామ్కు డ్యుయెల్ రోల్ కాన్సెప్ట్ ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది చూడాలి.