ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే టక్కున ఎస్.ఎస్.
తమన్ పేరు చెబుతారు.ఇప్పటికే పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి మంచి గుర్తింపు అందుకున్న తమన్ మరికొన్ని వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రస్తుతం కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా ఈయన సర్కారీ వారి పాట సినిమా ద్వారా మరొక విజయాన్ని తన సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం సర్కారీ వారి పాట సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ పలు ఆసక్తికరమైన విషయాలు గురించి ప్రస్తావించారు.తనకు ఎప్పటినుంచో ఒక కోరిక ఉందని, అయితే ఆ కోరిక తీరే సమయం ఎప్పుడు వస్తుందో అంటూ తన మనసులో ఉన్న తన కోరికను బయటపెట్టారు.
ఇంతకీ సమంత కోరిక ఏమిటి అనే విషయానికి వస్తే ఆయనకు తన భార్యతో కలిసి స్టేజి షోలు చేయాలనే కోరిక ఉందని అసలు విషయం బయట పెట్టారు.
తమన్ భార్య పేరు శ్రీ వర్దిని.ఆమె ఒక ప్లేబ్యాక్ సింగర్.ఇప్పటివరకు తను తమన్ సంగీత సారధ్యంలో మూడు నాలుగు పాటలు పాడింది.
అదేవిధంగా ఆమె గతంలో మణిశర్మ, యువన్ శంకర్ రాజా వద్ద కొన్ని పాటలు పాడింది.అయితే ఇప్పటి వరకు తాను పలు పాటలు పాడిన తనకు సరైన గుర్తింపు రాలేదు.
ఎప్పుడైతే సింగర్ గా తన భార్యకు గుర్తింపు లభిస్తుందో అప్పుడు తన భార్యతో కలిసి స్టేజి షోలు చేస్తానని ఈ సందర్భంగా తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.మరి తనన్ కోరిక త్వరగా నెరవేరాలని కోరుకుందాం.