“2019 ఎన్నికల్లో” చంద్రబాబు “విజయం తధ్యం”..ఎలా అంటే

తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు మార్పులు వేగంగా మారుతున్నాయి.ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో…ఒంటరి పోరు చేస్తారో ఇప్పటికే ఒక అవగాహనకి వచ్చేశారు.

 Will Chandra Babu Naidu Win 2019 Elections In Ap-TeluguStop.com

ముఖ్యంగా ఏపీ రాజకీయాలలో మాత్రం ఎవరు ఎవరితో ముందుకు వెళ్ళాలి అనే విషయంలో ఎంతో క్లారిటీ తో ఉంటున్నారట.ఈ విషయంపైనే ఏపీ రాజకీయాలలో చర్చ కొనసాగుతోంది.అయితే, తాజా సమాచారం ప్రకారం దాదాపు అన్ని పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటమే చేస్తాయని తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ-టీడీపీల‌ భంధం చెడిపోయిన నేపధ్యంలో మళ్ళీ వీరు కలిసే పరిస్థితి లేదు.ఇక‌ ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటి సారిగా పోటీ చేయబోతున్న జనసేన పార్టీ చంద్రబాబు తో జట్టు కడుతుందా లేక వామపక్షాలు తోడు అవుతాయా అంటే చెప్పలేని పరిస్థితి…పైగా పవన్ తాజా కామెంట్స్ తో చంద్రబాబుతో సయోధ్య కష్టమనే చెప్పాలి…అయితే జగన్ పవన్ కూడా కలిసే పరిస్థితులు ఎక్కడా కనిపిచడం లేదు.మరో వైపు బీజేపీ-జ‌గ‌న్ ఏమ‌న్నా పొత్తు పెట్టుకుంటాయా.

అంటే జగన్ ఆ సాహసం చేయదు ఎందుకంటే ఇప్పటికే బీజేపి ఏపీకి చేసిన అన్యాయం వలన ఏపీలో బీజేపి పెద్ద విలన్ అయ్యింది.ప్రజలు బీజేపి పేరు చెప్తేనే మండి పడుతున్నారు.

ఇలాంటి సమయంలో జగన్ బీజేపి పొత్తుకి తెరతీస్తే తప్పకుండా దెబ్బతింటాడు.సో జగన్ ,బిజెపి పొత్తు సైతం లేనట్టే.

ఇక కాంగ్రెస్ ఊసులోకే లేదు.దానితో ఎవరు కలవను కూడా కలవరు.


అయితే ఈ పరిస్థితులని బట్టి చుస్తే అన్ని పార్టీలు ఈ సారి ఎన్నికల్లో ఒంటరి పోరునే జరుపనున్నాయి.అయితే ఇప్పుడు ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతాయి ఎలాగో బీజేపి ,కాంగ్రెస్ పార్టీలు చావు దెబ్బ తినక మానవు.ఆ రెండు పార్టీలని పక్కన పెట్టి చూస్తె.ముందుగా పవన్ కళ్యాణ్ జనసేన విషయానికి వస్తే పవన్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో.ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో.ఒక విషయంపై ఈరోజు స్పందిస్తే మళ్ళీ ఆ ఊసే లేదు.

ఏపీలో ఉన్న ప్రజలలో ఇదే తరహా కన్ఫ్యూజ్ 75 శాతం మంది ప్రజలకి ఉంది.ఒక సారి జగన్ చీటర్ అంటాడు.

జగన్ తో జట్టు కట్టే ప్రయత్నాలు చేస్తాడు.మరో మారు చంద్రబాబు అంత అనుభవజ్ఞులైన వ్యక్తి ఎవరు లేరు అంటూనే చంద్రబాబు అవినీతి పరుడు అంటూ విమర్సలు చేస్తూ ఉంటారు.

ఇలాంటి గోడమీద పిల్లి లాంటి పార్టీ పై ప్రజలు ఏ మాత్రం నమ్మకం పెట్టుకోరు.

ఇక ఏపీలో అధికారంలో ఉన్న టిడిపి పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ ఒంట‌రిగా పోటీ చేసినా ఎలాంటి ఢోకా లేకుండా తిరిగి అధికారం సంపాయించుకోవ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు అన్ని జిల్లాల్లోనూ వినిపిస్తోంది…ఎందుకంటే ప్ర‌ధానంగా కిందిస్థాయి కేడ‌ర్ మొద‌లుకుని నేత‌ల వ‌ర‌కు అంద‌రూ ఎంతో సమన్వయంతో ఉండటం కార్యకర్తల బలం టిడిపి కి మెండుగా ఉండటం.

ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో సంతృప్తిగా ఉండటంతో పాటు ఈ సమయంలో ఏపీ ని అభివృద్ధి చేయాలి అంటే కేవలం అనుభవజ్ఞులైన చంద్రబాబు కే సాధ్యం అనే ఆలోచన ఏపీ ప్రజలలో ఉండటం తెలుగుదేశం పార్టీ గెలుపుకి సహకరిస్తాయని చెప్పవచ్చు.

చివరిగా వైసీపి విషయంలో చుస్తే జగన్ పాదయాత్ర చేసేది జనం కోసం కాదని.

అధికారమే ప్రధానమైన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడని చెప్పవచ్చు.అందుకే పాదయాత్రకి సంభందించిన రిజల్ట్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

రాష్ట్రాని ఒక అనుభవం ఉన్న.ముందు చూపు ఉన్న చంద్రబాబు కి అప్పగించాలా లేక జైలు కు వెళ్లి 16 నెల‌లు శిక్ష అనుభవించిన జగన్ కి ఏపీ ని అప్పగించాలా అనే విషయంలో ఏపీ ప్రజలు చంద్రబాబు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తాజా సర్వేల ప్రకారం కూడా తెలుస్తోంది.

అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏపీ ప్రజలు టిడిపికి పట్టం కడుతారని అంటున్నారు…ఈ సారి విజయం టిడిపి అనడంలో సందేహం లేదని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube