తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ పెద్ద ఎత్తున సంచలనంగా మారిన పరిస్థితి ఉంది.ఇటు అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూ రాజకీయ రణరంగం మొదలైన పరిస్థితి ఉంది.
అయితే తాజాగా తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.తీన్మార్ మల్లన్న చేరికతో బీజేపీ మరింత దృఢంగా మారుతుందనుకున్న స్థితిలో గతంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టడమే కాకుండా ఒకింత ట్రెండింగ్ గా మారుతుందా అనేంతలా పెద్ద ఎత్తున నెటిజన్ల నుండి బీజేపీ వ్యతిరేక రియాక్షన్ వచ్చిన పరిస్థితి ఉంది.
ఇదే అదునుగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కూడా ఇటు బండి సంజయ్, మల్లన్నని ఇరుకునపెట్టేలా తమదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.అయితే తీన్మార్ మల్లన్న చేరికతో లాభం జరుగుతుందని ప్రస్తుతం బీజేపీ నేతలు భావించినా తరువాత కాలం జరుగుతున్న కొద్దీ బీజేపీ భావజాలంలో తీన్మార్ మల్లన్న ఇమడలేడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అంతేకాక బీజేపీ ఇక రానున్న రోజుల్లో ఇక దూకుడుగా వెళ్ళేలా వ్యూహ రచన చేస్తోంది.ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సోషల్ మీడియా వినియోగించడంపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్న వారందరూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో బీజేపీ మాత్రమే కనిపించేలా చాలా పెద్ద ఎత్తున వ్యూహ రచన చేస్తోంది.టీఆర్ఎస్ ప్రస్తుతం పాలనపైనే పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన పరిస్థితుల్లో ఇంకా టీఆర్ఎస్ రాజకీయ వాతావరణంలోకి ప్రవేశించకపోయినా తాజాగా కేసీఆర్ ఎన్నికల వాతావరణం మొదలైనప్పుడు చూసుకుందామని ఎన్నికల సమయంలో రాజకీయంచేద్దామని కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.