కొత్త స్టేడియంలో స్పిన్ బౌలర్లు విసిరే బంతులకు వికెట్స్ ధనాధన్ పడిపోతున్నాయి.పిచ్ మహిమో లేక స్పిన్ బౌలింగ్ మహిమో తెలియదు కానీ బంతి గిరగిరా తిరుగుతూ బ్యాట్స్ మెన్ లను తక్కువ సమయంలోనే ఓటు చేయగలిగింది.
అయితే ఇంగ్లాండ్, టీమిండియా జట్లు వెంటనే అవుట్ అయ్యాయి కానీ ప్రత్యర్థి జట్టు కంటే టీమిండియా స్పిన్ బౌలింగ్ ధాటికి తట్టుకొని విజయం సాధించగలిగింది.దీంతో 2-1 సిరీస్ తో ఇండియా పైచేయి సాధించే దిశగా దూసుకెళ్తోంది.
అయితే రెండు రోజుల్లోనే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగియటంతో చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.దీనిపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.ముఖ్యంగా ఓటమిపాలైన ఇంగ్లండ్ క్రికెటర్లు బాగా విమర్శలు చేస్తున్నారు.అయితే ఈ విమర్శలను తిప్పికొట్టడానికి టీమిండియా క్రికెటర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.ఫోర్త్ టెస్ట్ కి పిచ్ ఎలా ఉండబోతుందో ఆలోచిస్తున్నాను అని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.
అలాగే పిచ్ పై పడుకొని ఉన్న ఒక ఫోటోని ఆయన తన పోస్ట్ కి జత చేశారు.అయితే ఈ ఫోటో పై రోహిత్ శర్మ భార్య రికిత ట్రోల్ చేశారు.
నేను పిచ్ పై పడుకుని విశ్రాంతి తీసుకుంటే నన్ను తిడతారు కానీ మీరు మాత్రం చక్కగా పిచ్ పై పడుకుంటారా? అని ఆమె రోహిత్ శర్మ పై చలోక్తులు విసిరారు.
దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.రోహిత్ శర్మ పోస్ట్ కూడా దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.వీరిద్దరి మధ్య కొనసాగిన సంభాషణ ప్రస్తుతం క్రికెట్ ప్రియులను ఫిదా చేస్తోంది.
ఇకపోతే చివరి టెస్ట్ లో గెలిచినా, మ్యాచ్ డ్రా అయినా టీమ్ ఇండియా ఫైనల్ కి చేరుకోవడం ఖాయం.అయితే చివరి టెస్టు అహ్మదాబాద్ వేదికగా మార్చి 4వ తేదీన ప్రారంభం కానున్నది.