హీరో శ్రీకాంత్ నటించిన కన్యాదానం సినిమా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ఆ సినిమాలో హీరో తన భార్య వేరే అతడిని ప్రేమించిందని తెలిసి మళ్లీ ఆమె ప్రియుడికి ఇచ్చి వివాహం చేస్తాడు.
ఈ ఫార్ములాతో వచ్చిన కన్యాదానం సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.ఇలాంటివి సినిమాల వరకు బాగానే ఉంటాయి కానీ నిజజీవితంలో జరగవు అనుకుంటారు అందరు.
కానీ కన్యాదానం సినిమాను మించిపోయింది ఒడిశాలో జరిగిన ఓ ఘటన.
ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి అనే ప్రాంతంలో ఓ భార్య తన భర్తకు వేరే అమ్మాయితో వివాహం జరిపించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.రామ కావసీ అనే వ్యక్తికి గాయత్రితో ఇదివరకే పెళ్లయ్యింది.అయితే అతడు పనిచేసే చోట ఐత మడకామి అనే యువతితో పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమగా మారింది.
తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే పోలీసులకు చెబుతానంటూ ఐత రామను బెదిరించింది.అతడికి పెళ్లయ్యిందని అతడు చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో రామ భార్య గాయత్రి సీన్లోకి ఎంట్రీ ఇచ్చి, తమ కుటుంబ పరువు పోకుండా ఉండాలని తన భర్తకు ఐతతో వివాహం చేయించింది.కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ ఈ వివాహం జరిపించింది.దీంతో గ్రామంలో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ ఘటన గురించి తెలుసుకున్న తెలుగు జనం ఇది కన్యాదానం సినిమాను మించిన కథ అని అంటోన్నారు.