హైదరాబాదులోని నల్లకుంటలో నిజంగానే సీన్ రివర్స్ అయిపోయింది.నిత్యం వేధింపులతో సతాయించే భర్తను హత్య చేసిన ఓ భార్య నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయింది.
నేటి ఉదయం వెలుగుచూసిన ఈ ఘటన నల్లకుంటలో కలకలం రేపింది.
వివరాల్లోకెళితే… గంగాధర్, విజయలక్ష్మి భార్యాభర్తలు.
నల్లకుంటలో నివాసముంటున్నారు.ఈ క్రమంలో భర్త నుంచి ఎదురవుతున్న వేధింపులను విజయలక్ష్మి చాలా కాలం పాటు పంటి బిగువునే భరించింది.
అయితే ఇటీవలి కాలంలో భర్త వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.దీంతో సహనం కోల్పోయిన విజయలక్ష్మి… గంగాధర్ ను చంపేసింది.
ఆ తర్వాత నేరుగా ఆమె పోలీస్ స్టేషన్ కు వచ్చి, తన భర్తను చంపేశానని చెప్పి పోలీసులకు లొంగిపోయింది.