పరశురామ్ అనే వ్యక్తి భార్య ఉండగానే మరొక పెళ్లి చేసుకున్నాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న ఈ ప్రబుద్దుడి బండారం మొదటి భార్య బట్టబయలు చేసింది.
మొదటి భార్య, పిల్లలు ఉండగానే అబద్దం చెప్పి మరొక మహిళను పెళ్లిచేసుకున్నాడు.అసలు విషయం తెలిసిన ఇద్దరు భార్యలు ఆ ప్రబుద్దుడుకి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.పరశురామ్ అనే వ్యక్తి బోర్ వెల్ వాహనాలు నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు.బోర్ వెల్ పనుల మీద తరచు బయటకు వెళ్తుంటాడు.మొదట్లో రెండుమూడు రోజులు పాటూ ఇంటికి వచ్చే వాడు కాదు.
తర్వాత వారం రోజులైనా ఇంటికి వచ్చేవాడు కాదు.ఆ తర్వాత అసలు మూడునెలలైనా ఇంటి మొహం చూడలేదు.దీంతో భార్యకు అనుమానం వచ్చింది.మూడునెలల తర్వాత ఇంటికి వచ్చిన పరశురామ్ మళ్ళీ వెంటనే పని మీద బయటకు వెళ్తున్న అని చెప్పాడు.
పరశురామ్ భార్య సరే అని చెప్పి పరశురామ్ ఎటు వెళ్తున్నాడో తెలుసుకునేందుకు అతడిని ఫాలో అవ్వగా అసలు విషయం బయటకు వచ్చింది.కామారెడ్డిలో పరశురామ్ రెండవ భార్యతో కాపురం పెట్టాడని తెలుసుకుంది.
దీంతో తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి బంధువులతో కలిసి అక్కడికి వెళ్ళింది.పరశురామ్ రెండవ భార్యతో కలిసి ఉండడాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
ఆ తర్వాత రెండవ భార్యపై దాడి చేయబోతుండగా అసలు విషయం తెలుసుకుంది.
పరశురామ్ తనకు పెళ్ళి కాలేదని చెప్పడం వల్లే తాను పెళ్లి చేసుకున్నానని చెప్పింది.
దీంతో ఇద్దరు భార్యలు పరశురామ్ ను చితకబాదారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరశురామ్ ను అదుపులోకి తీసుకున్నారు.