ఇటీవలే కుటుంబాలలో జరిగే చిన్న చిన్న గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి.మనుషులలో తమ మాటే నెగ్గాలి, తాము చెప్పిందే కరెక్ట్ అని ఇతరుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు.
దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవలు అగ్ని రాజేసీ దారుణాలకు కారణం అవుతున్నాయి.
ఇటీవలే ఈ గొడవల కారణంగా పిల్లలు అనాధలుగా మారడం, హత్య చేసి నిందితులుగా మారి జైలు పాలు కావడం లాంటి దారుణాలు పెరుగుతూ పోతున్నాయి.
ఇలాంటి కోవకు చెందిన ఓ ఘటన కృష్ణా జిల్లాలోని పెనమలూరు మండలం( Penamaluru ) కానూరు పరిధిలో చోటు చేసుకుంది.
కానూరులోని టైం హాస్పిటల్ సమీపంలో నివసించే సాలిగ్రామ్ సురేష్, అరుణ దంపతులకు 24 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది.వీరికి ఇద్దరు కుమారులు సంతానం.సురేష్( Suresh ) ఆటోనగర్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే పెద్ద కుమారుడు ఐదు సంవత్సరాల క్రితం ట్రాన్స్ జెండర్ గా( Transgender ) మారి, తన పేరు రోజా గా మార్చుకున్నాడు.పెద్ద కొడుకు ట్రాన్స్ జెండర్ గా మారడం తండ్రికి ఇష్టం లేదు.
అందువల్లనే పెద్దకొడుకు తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో నివసిస్తున్నాడు.
ఇటీవలే పెద్ద కుమారుడు ఇంటికి రావడంతో తండ్రి గొడవకు దిగితే గురువారం సాయంత్రం పెద్ద కుమారుడు కాగజ్ నగర్ కు వెళ్ళిపోయాడు.పెద్ద కుమారుడుతో గొడవ పెట్టుకున్నందుకు సురేష్ పై భార్య, చిన్న కొడుకు గొడవపడ్డారు.క్రమంగా గొడవ పెరిగి సురేష్ హత్యకు దారి తీసింది.
పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి భార్య, చిన్న కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.కుటుంబ కలహాల కారణంగా సురేష్ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.