ఇప్పుడున్న సమాజంలో భార్యా, భర్తలు కేవల మధ్య అక్రమ సంబంధాలు అనేవి ఎంతలా చిచ్చు పెడుతున్నాయో చూస్తూనే ఉన్నాం.వీటి మాయలో పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చాలామంది.
ఇంకా కొందరు అయితే ప్రాణాలను కూడా తీస్తున్నారంటే వీటి ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి ఓ ఘటన అందరినీ కలిచివేస్తోంది.
కృష్ణా జిల్లాలోని కొండూరు మండలానికి చెందినటువంటి కేశ్యాతండాలో జరిగిన ఉదంతం అందరినీ షాక్కు గురి చేస్తోంది.ఈ తండాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి రీసెంట్ గా ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఎందుకంటే ఆయన భార్య ఓ కానిస్టేబుల్తో సన్నిహితంగా ఉంటోందని, ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం పెడుతోందని ఆవేదన చెంది దీన్నంతా కూడా సెల్ఫీ వీడియోలో రికార్డు చేశారు.ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.ఈయనకు పెండ్లి అయి చాలా సంవత్సరాలు అవుతోంది.అయితే ఇదే ప్రాంతానికి చెందినటువంటి ఓ కానిస్టేబుల్ తన భార్య సన్నిహితంగా ఉంటున్నారు.
వీరి వివాహేతర సంబంధం తెలుసుకున్న భర్త ఆమెను తీరు మార్చుకోవాలంటూ హెచ్చరించాడు.
కానీ ఆమె మాత్రం వినకుండా అలాగే చేసేసరికి అతను తీవ్ర ఆవేదనకు గురై చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఇక ఇలా చేసేముందు ఓ సెల్ఫీ వీడియో తీసి ఇందులో జరిగిన విషయం మొత్తం వివరించి ఆ తర్వాత పురుగుల మందు తాగాడు.కాగా ఆయన్ను త్వరగానే గుర్తించిన వారు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇక ఆ వ్యక్తి పరిస్థితి కాస్త సీరియస్ గా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు.అయితే ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భర్త ప్రాణాలను ప్రమాదంలో పడేసిన భార్యపై అందరూ ఆగ్రహం తెలుపుతున్నారు.ఇలాంటివి ప్రాణాల మీదకు తెస్తాయని, కాబట్టి వీటి మాయలో పడొద్దంటూ పలువురు సూచిస్తున్నారు.