ఎనిమీదేళ్లుగా నీ కోరిక ఎందుకు తీరాలేదక్కా.. రష్మీకి ఎదురైనా ప్రశ్న ఏమిటంటే?

బుల్లితెరపై తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ రష్మీ గురించి అందరికీ పరిచయమే.ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ ద్వారా తొలిసారిగా బుల్లితెరపై పరిచయమైంది.

 Why Your Wish Not Been Fulfilled For Eight Years Rashmi Faced The Question Detai-TeluguStop.com

బుల్లితెర కంటే ముందు వెండితెరపై పలు సినిమాలలో నటించింది.కానీ వెండితెరపై ఎక్కువ కాలం నిలువ లేకపోయింది.

ఇక ప్రస్తుతం బుల్లితెర స్టార్ యాంకర్ ల లిస్టు లో పడిపోయింది రష్మీ.

ఎన్నో ఏళ్ల కిందట సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రష్మీ గౌతమ్ పలు సినిమాలలో అందుకోని క్రేజ్ ను కేవలం జబర్దస్త్ ద్వారానే సంపాదించుకుంది.

ఇక ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఇక జబర్దస్త్ తర్వాత కూడా సినిమాలలో నటించిన అంత క్రేజ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది.జబర్దస్త్ లో కూడా రష్మీ కి ఇంత క్రేజ్ రావడానికి కారణం మరో కమెడియన్ సుడిగాలి సుధీర్ అనే చెప్పాలి.

ఎందుకంటే అతడితో బాగా సన్నిహితంగా ఉంటూ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.

నిజానికి మల్లెమాల కూడా వీరి సన్నిహితంను బాగా క్యాష్ చేసుకుంటుంది.ఇక వీరిద్దరు వేదికపై చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

అందరి ముందు వీరిద్దరి మధ్య తెగ రొమాన్స్ లు కూడా జరుగుతుంటాయి.ఇక వీరిని చూసి ఎంతో మంది ప్రేక్షకులు మొదట్లో షాక్ అయ్యారు.

దీంతో వీరి మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తున్నట్లు గతంలో బాగా పుకార్లు వినిపించాయి.కానీ తమ మధ్య ఏమీ లేదు అంటూ చాలాసార్లు బయటపెట్టారు రష్మీ, సుధీర్.అంతేకాకుండా జబర్దస్త్ లో చేసే మరికొంత మంది ఆర్టిస్టులు కూడా వీరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదు అంటూ స్పష్టం చేశారు.అయినా కూడా వీరు మాత్రం షో లో రియల్ కపుల్స్ లాగా రెచ్చిపోతుంటారు.

అలా మళ్లీ ఎన్నో అనుమానాలు ఎదురవడంతో కేవలం షో కోసం మాత్రమే అలా చేస్తున్నామని.దానివల్ల తమ షోకు మరింత ఆదరణ లభిస్తుందని గతంలోనే తెలిపారు.

ఇక మరికొందరు వీరి మధ్య నిజమైన ప్రేమ నడుస్తుందని కేవలం పైకి అలా చెప్పుకుంటున్నారని అనుకున్నారు.కేవలం ఈ షో లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న మరో ఢీ డాన్స్ షో లో కూడా వీరిద్దరు టీం లీడర్స్ గా పని చేస్తున్నారు.

ఈ షోలో కూడా వీరి మధ్య ఘాటైన రొమాన్స్ లు జరుగుతూ ఉంటాయి.ఇక సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ రియల్ కపుల్ కావాలని ఎంతో మంది అభిమానులు కోరుకుంటారు.ఇదిలా ఉంటే తాజాగా అందరిముందు రష్మి కి గట్టి షాక్ ఎదురయ్యింది.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో విడుదలయింది.

అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా రేపు ఈ షోను ప్రసారం చేయనున్నారు.ఇక ఇందులో నలుగురు అమ్మాయిలతో రష్మీ కూడా దీపాలు వెలిగించింది.

వెంటనే ఈ రోజు దీపాలు వెలిగించి ఏ కోరిక కోరినా తీరుతుంది అని అనేసరికి పక్కనున్న ఓ అమ్మాయి.మరి ఎనిమిది సంవత్సరాలుగా నీ కోరిక ఎందుకు తీరట్లేదు అక్క అని అందరి ముందు ప్రశ్నించింది.

దాంతో రష్మీ షాక్ అయినట్లు మొఖం పెట్టి తన నవ్వును బయటపడకుండా దాచి పెట్టుకుంది.దీనిని బట్టి ఎనిమిదేళ్ల నుండి సుడిగాలి సుధీర్ తో సన్నిహితంగా ఉన్న కూడా వీరిద్దరి జోడి కాలేకపోతున్నారన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి అలా అడిగినట్లు అనిపించింది.ఇక ఈరోజు గుడి దగ్గరికి చాలామంది ఎదవలు తిరుగుతుంటారని ఎవరికి పడితే వారికి పడి పోకండి అర్థమైందా అంటూ రష్మీ అనడంతో వెంటనే ఆ అమ్మాయి.ఫుల్ ఎక్స్పీరియన్స్ మా అక్కకి అంటూ గట్టి షాక్ ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube