బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తాజాగా తన పెళ్లి విషయం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.కియారా అద్వానీ, వరుణ్ ధావన్ కలిసి నటించిన తాజా చిత్రం జుగ్ జుగ్ జియో.
ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది.ఫ్యామిలీ డ్రామాగా కనిపించ కాబోతున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, నీతూ కపూర్ లు కూడా కనిపించబోతున్నారు.
ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు చిత్ర బృందం.
ఈ క్రమంలోనే మీడియా హీరోయిన్ కీరా అద్వానీని అని పెళ్లి గురించి ప్రశ్నించగా.
ఇంతలో పక్కనే ఉన్న ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ స్పందిస్తూ.తనపై తాను సెటైర్లు వేసుకున్నాడు.
మీరు నా పెళ్లి గురించి ఎందుకు అడగలేదు? నాకు 50 అయిన నేను ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు.అంటే నేను పెళ్లికి అర్హుడిని కాదు అని మీరు అనుకుంటున్నారా.
నేను కూడా పెళ్లి చేసుకోవచ్చు.పెళ్లికి టాలెంట్ అవసరం లేదు అవసరం కావాలి అంటూ కరణ్ జోహార్ సమాధానం ఇచ్చారు.
ఉదయ్ కి ఆరా అద్వానీ పెళ్లి గురించి మీడియా అడగగా దానికి కారణం సమాధానం చెప్పడంతో పాటు కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
ఆ తర్వాత అదే విషయంపై కియారా అద్వాని స్పందిస్తూ.సెటిల్ అవడం అంటే పెళ్లి చేసుకోవడమా.సంపాదన బాగా ఉంది.
సినిమాలు కూడా చేస్తున్నాము.స్టార్ డమ్ కూడా ఉంది.
సెటిల్ అయినట్టు కాదా అంటూ కియారా అద్వానీ కాస్త ఘాటుగా స్పందించింది.కరణ్ జోహార్ కూడా కియారా అద్వానీ మాదిరిగానే అదే అర్థం వచ్చే విధంగా మాట్లాడారు.
కాగా కరణ్ జోహార్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారు.
సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు కరణ్ జోహార్.