ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమిండియా జట్టులో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ను ఎంపిక చేయకపోవడాన్ని మాజీ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుపట్టాడు.అటు శ్రీలంక పర్యటనలో ఇటు ఐపీఎల్ లోను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న రాహుల్ ను జట్టు నుంచి తప్పించడానికి కారణమేంటని బీసీసీఐ సెలెక్టర్లను సూటిగా ప్రశ్నించాడు.
ఐపీఎల్ ల చాహల్ నా గత రెండు మ్యాచుల్లో ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.శ్రీలంకతో జరిగిన సిరీస్ లోనూ రాణించాడు.టీ-20 ఫార్మాట్ లో ఎలా బౌలింగ్ చెయ్యాలో అతనికి తెలుసు.ఎంతగా నైపుణ్యం ఉన్న బౌలర్.
టీ-20 ప్రపంచ కోసం సెలెక్టర్లు ఎందుకు ఎంపిక చేయలేదో నాకు అర్థం కావడం లేదు అని సెహ్వాగ్ ప్రశ్నించాడు.యూఏఈ, ఒమన్ వేదికలుగా అక్టోబర్ 17 నుంచి ఐసిసీ టీ-20 ప్రపంచ కప్ ప్రారంభంకానుంది.
ఈ మెగా టోర్నీ కోసం 15 మంది ఆటగాళ్ళతో ఎంపిక చేసిన భారత జట్టును ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది.అందులో ఐదుగురు స్పిన్నర్లకు అవకాశం ఇచ్చింది.రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకోగ .చాహల్ ను జట్లు లో ఎంపిక చేయలేదు.అయితే టోర్నీ ప్రారంభానికి ముందుగా జట్టులో ఏమైనా మార్పులు చేసుకునే అవకాశం ఉంది.