టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో, తన నవ్వుతో ఎంతో మంది కుర్రాళ్ళు మనసులను దోచుకుంది.
తన నటనతో అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలో కూడా నటించింది.
ఇదిలా ఉంటే తాజాగా అనుపమ చాలా కోపంగా కనిపించింది.
తొలిసారిగా మలయాళం ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా.తాను నటించిన శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే వంటి సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అంతే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది అనుపమ.
తనకు సంబంధించిన ఫోటోలను, ఫన్నీ వీడియోలు బాగా పంచుకుంటుంది.నిజానికి ఆమె షేర్ చేసే ఫన్నీ వీడియోల వల్ల అల్లరి పిల్లగా పేరు సంపాదించుకుంది.
ఇందులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.గతంలో తన సోదరుడితో కలిసి ఆట పట్టిస్తున్న వీడియోలను, అంతే కాకుండా తాను నటిస్తున్న 18 పేజెస్ సినిమా షూటింగ్ సమయంలో చేసిన వీడియోలను బాగా పంచుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఫిలింనగర్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా అనుపమ ఫోటోను పంచుకున్నారు.అందులో ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన అనుపమ కాస్త కోపంగా చూస్తున్నట్లు అనిపించింది.దీంతో ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఎందుకు అంత కోపంగా చూస్తున్నావ్ అనుపమ అంటూ కామెంట్స్ చేయగా.మరి కొందరు ఏంటి ఇలా మారిపోయావు అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక 18పేజెస్ తో పాటు మరో సినిమాలో కూడా అవకాశం అందుకుంది.