సీమ రాజకీయాల్లో ఉన్నంత వైరం మరే ఇతర ప్రాంతాల్లోనూ ఉండదేమో.ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలు సాగాయి.
వారి వారసులే నేడు పార్టీల నుంచి ప్రతినిధులుగా ఉన్నారు.వారు మాత్రమే రాజకీయాలను ఏలుతున్నారు.
ఇందులో మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమనే చెప్పాలి.ఇక్కడ జేసీ బ్రదర్స్ ప్రభాకర్ రెడ్డి, దివాకర్రెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయమే అవసరం లేదు.
ఒకప్పుడు వీరు సీమ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు.అయితే జగన్ వేవ్ ముందు వీరు ఓడిపోవాల్సి వచ్చింది.
కాగా మళ్లీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారు ఈ మధ్య కొంత భయపడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.వారు జగన్కు ఎందుకు బెదురుతున్నారనే ప్రచారం రీసెంట్గా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.మొన్నటికి మొన్న చంద్రబాబు తలపెట్టిన నిరసన దీక్ష ఎంతలా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.
కాగా ఈ దీక్షకు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు, నేతలు వచ్చారు.ఇందులో భాగంగా అనంతపురం జిల్లా నేతలు వచ్చినా జేసీ బ్రదర్స్ మాత్రం ఇంటి నుంచి కాలు కదపలేదు.
కనీసం చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావం కూడా ప్రకటించలేదు.ఓ క్రమంలో వారి కంటే చిన్న స్థాయిలో ఉన్న వారు కూడా వైసీపీ మీద ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంటే జేసీ బ్రదర్స్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారు.తీవ్ర స్థాయిలో వైసీపీ మీద విమర్శలు చేసి, నిరసన దీక్షకు వెల్లిన వారిపై చాలా కేసులు పెట్టినా జేసీ వర్గంపై మాత్రం పోలీసులు కేసులు పెట్టకపోవడం ఇక్కడ గమనార్హం.
దీన్ని బట్టి జేసీ బ్రదర్స్ జగన్ కు భయపడుతున్నారా అనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి.మరి ఇప్పటికే చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్న జేసీ వర్గం తాజా తీరుతో వారు టీడీపీని వీడుతారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.