మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘోరంగా పరాభవం పాలైన విషయం తెల్సిందే.రాజకీయంగా పెద్దగా బిజీగా లేని పవన్ కళ్యాణ్ డబ్బుల సంపాదన కోసం సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అందరు వ్యక్తం చేస్తున్నారు.
ఆయన మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని, తన స్టార్డంతో డబ్బులు సంపాదించడంతో పాటు, నలుగురిలో ఆలోచనలు కలిగించాల్సిన అవసరం ఉంది అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే పవన్ సినిమాల్లో రీ ఎంట్రీకి సిద్దం అవుతున్నాడు.
తమిళ దర్శకుడు హరి తాజాగా పవన్ కళ్యాణ్ను కలిశాడు.ఆయన పవన్ను కలవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటా అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది.ఇద్దరి మద్య ఏ విషయమై చర్చలు జరిగాయనే విషయంపై క్లారిటీ అయితే లేదు కాని వీరిద్దరు సినిమా విషయమై మాట్లాడుకుని ఉంటారు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు.మైత్రి మూవీస్ వారి వద్ద పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ తీసుకున్నాడు.
రెండు సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ను తీసుకుని సినిమా చేయకుండా ఆలస్యం చేస్తూ వస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ వద్దకు ఇప్పుడు దర్శకుడు హరిని మైత్రి మూవీస్ వారే పంపి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.సినిమాల్లో రీ ఎంట్రీకి పవన్ ఆసక్తిగా ఉన్న కారణంగా అడ్వాన్స్ను వెనక్కు తీసుకోకుండా పవన్ తన ఖాళీ సమయంను సినిమా చేసి ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.హరి దర్శకత్వంలో ఏఆర్ రహమాన్ సంగీత సారధ్యంలో మైత్రి మూవీస్ బ్యానర్లో ఒక చిత్రం రూపొందబోతుంది.
ఆ సినిమా గురించి త్వరలోనే ప్రకటన రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై త్వరలో క్లారిటీ రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.