బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో మెగా హీరో రాం చరణ్, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.
ఈ మల్టీ స్టార్ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అటు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ పాల్గొంది.ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ముంబైలోనూ సినిమా యూనిట్ ప్రెస్ మీట్లతో ప్రమోషన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో నటించిన కీలక నటి, ప్రముఖ హీరోయిన్ శ్రియా మాత్రం ఈ ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు.
వెండితెరపై తన బంగారు రంగు అందాలను ఒలికిస్తూ జనాలను మత్తులో నింపిన ఈ ముద్దుగుమ్మ ఓ రష్యన్ ను పెళ్లి చేసుకుంది.
కొంత కాలం క్రితమే ఓ పాపకు జన్మనిచ్చింది.అటు తెలుగులో టాప్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత కాస్త సినిమాలకు దూరం అయ్యింది.మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈ అమ్మడు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది.ఆమెకు మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి.
తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగణ్ కు జోడీగా నటించింది.
ట్రైలర్ లోనూ తను బాగా కనిపించింది.అయితే ప్రమోషన్ విషయంలో తనను పక్కన పెట్టడంపై శ్రియ అసహనం వ్యక్తం చేస్తుందట.రాజమౌళి సినిమా ప్రమోషన్ కోసం కేవలం తనను మాత్రమే పిలవడం లేదని బాధపడుతుందట.
అటు శ్రియ నటించిన మరో సినిమా గమనం ప్రమోషన్స్ లో ఆమె బిజీ అయ్యింది.సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోయినా.సినిమాను సక్సెస్ చేసేందుకు శ్రియ పలు టీవీ ఛానెల్స్ కు వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఆర్ ఆర్ ఆర్ టీం తనను ప్రమోషన్ కోసం పిలిస్తే తప్పకుండా వెళ్తానని చెప్తోంది.
అయితే ఈ సినిమాలో శ్రియ కీలక పాత్ర కాకపోవడం మూలంగానే ఆమెను ప్రచారం కోసం పిలవడం లేదనే టాక్ వినిపిస్తుంది.