మనిషి ప్రతి రోజు కనీసం 10 లీటర్ల వాటర్ అయినా తీసుకోవాలని నిపుణులు అంటూ ఉంటారు.మనిషి శరీరంకు ఆహారం కంటే నీరు అత్యంత అవసరం.
ఆ విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.అయినా కూడా కొందరు మంచి నీళ్ల విషయంలో చాలా లైట్గా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది.
మంచి నీళ్లు తాగేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మంచి నీళ్లు ఎలా తాగాలనే విషయాలను పట్టించుకోరు.కొందరు మంచి నీళ్లు అయితే బాగానే తాగుతారు కాని కరెక్ట్ పద్దతిలో తాగక పోవడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మంచి నీళ్లు కొందరు పడుకుని తాగుతూ ఉంటారు.పడుకుని తాగడం ఏమాత్రం కరెక్ట్ కాదు.పడుకుని తాగడం వల్ల మంచి నీళ్లు నేరుగా ఆహార నాళ్లంలోకి కాకుండా స్వర పేటికలోకి లేదా ఇతర మార్గాల ద్వారా వెళ్తుంది.ఆ సమయంలోనే పొర పోవడం కూడా జరుగుతుంది.
అందుకే మంచి నీళ్లు పడుకుని తాగడం ఏమాత్రం కరెక్ట్ కాదని నిపుణులు చెబుతూ ఉన్నారు.ఇక స్వర పేటికలోకి మంచి నీళ్లు పోకుండా ఉండేందుకు నిల బడితాగడం మంచిదా అనుకుంటున్నారా, అది కూడా మంచిది కాదు.
మంచి నీరు నిల్చుని తాగడం కూడా ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మంచి నీళ్లు ఖచ్చితంగా కూర్చుని తాగాలి అనేది పెద్దలు, వైధ్యులు చెబుతున్న మాట.సుఖాసనంలో కూర్చుని మంచి నీళ్లు తాగడం వల్ల తాగిన ప్రతి చుక్క కూడా శరీరంకు ఉపయోగపడుతుందని అంటున్నారు.నిల్చుని తాగిన సమయంలో నీరు ఒక్కసారిగా ఆహార గొట్టంలోకి వెళ్లి పోతాయి.
అలా వెళ్లి పోవడం వల్ల అజీర్తి, కడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ వంటి పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే మంచి నీళ్లు తాగిన సమయంలో కూర్చుని తాగడం అన్ని విధాలుగా కరెక్ట్ అంటూ నిపుణులు చెబుతున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో మినహా మీరు ఇకపై నిల్చుని మంచి నీళ్లు తాగరని ఆశిస్తున్నాం.
ఈ విషయాన్ని అందరికి కూడా తెలియజేసి ఆరోగ్యం కాపాడుకునేలా చేయడం మన బాధ్యత.
అందుకే దీన్ని షేర్ చేయండి.