ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి స్నేహితులు తక్కువ కాని అభిమానులు ఎక్కువ.త్రివిక్రమ్, ఆలీ, శరత్ మరార్, బండ్ల గణేష్ … ఇలా మహా అయితే ఓ అయిదారు పేర్లు చెప్పొచ్చు అంతే.
ఇందులో శరత్ మరార్ తో స్నేహం ఇప్పటిది కాదు, జాని సమయం నుంచే ఇద్దరు మంచి స్నేహితులు.జాని సినిమా నుంచి పవన్ కళ్యాణ్ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది.
కాని అలాంటి గడ్డుకాలంలో కూడా పవన్ కళ్యాణ్ తో ఉన్నారు శరత్.మొత్తానికి ఆ స్నేహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ సొంతంగా రాసుకున్న కథని ఏమాత్రం ఆలోచించకుండా “సర్దార్ గబ్బర్ సింగ్” అంటూ నిర్మించారు.
ఆ సినిమా ఫలితం తేడా కొట్టింది.డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డుమీదకి వచ్చి నష్టపరిహారం కావాలంటూ నిరసనలు వ్యక్తం చేసారు.
ఇంత జరిగినా శరత్ మరార్ పవన్ ని వదలలేదు.
కాటమరాయుడు చిత్రాన్ని కూడా ఆయనే నిర్మించారు.
ఆ సినిమా అజిత్ నటించిన వేదాలంకి రీమేక్.తెలుగులోకి ఆల్రేడి డబ్ అయిన సినిమా అని తెలిసినా, పవన్ కోసం మరోమాట మాట్లాడకుండా సినిమా తీసారు.
షూటింగ్ సమయంలో పవన్ ఆలస్యం చేయడం, షూటింగ్ కి ఇష్టం వచ్చినప్పుడు రావడం, టెక్నిషియన్స్ ని, చివరకి దర్శకుడిని మార్చినా ఒర్చుకున్నారు శరత్ మరార్.ఆ సినిమా కూడా సర్దార్ గబ్బర్ సింగ్ లానే ఫ్లాప్ గా నిలిచింది.
ఈ సినిమాకి కూడా నష్టాలే వచ్చాయి.ఆ ఫైనాన్షియల్ విషయాల్లోనే పవన్ కి శరత్ మరార్ కి ఏవో గొడవలు జరిగినట్లు ఫిలింనగర్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
శరత్ ఈమధ్య పవన్ తో కనిపించడం లేదు.ఇన్నాళ్ళు పవన్ కి మానసికంగా, ఆర్థికంగా సపోర్ట్ గా ఉంటూ వచ్చిన శరత్, పవన్ పద్ధతులు, బద్ధకం నచ్చకే స్నేహాన్ని తెగతెంపులు చేసుకున్నారని, పవన్ దగ్గరకి రావడమే మానేసారని టాక్.
ఈ మార్పు చూస్తోంటే ఇద్దరి ఫ్రెండ్ షిప్ కోటకి బీటలు వారాయని, ఇక వీళ్ళిద్దరూ తిరిగి కలవడం కష్టమే అని అభిప్రాయపడుతున్నారు ఫిలింనగర్ జనాభా.మరి ఇందులో నిజమెంతో అబద్దమెంతో.
ఇక మిగితా విషయాలకి వస్తే, ప్రస్తుతం హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత ఏఏం రత్నంతో ఓ సినిమా, మైత్రి మూవీ మేకర్స్ తో మరో సినిమా కమిట్ అయి ఉన్నా, ఆ సినిమాలు ఎప్పుడు పట్టాలు ఎక్కుతాయి, అసలు ఎక్కుతాయా లేదా అనే విషయం మీద క్లారిటి లేదు.