తెలుగులో వందలకి పైగా చిత్రాల్లో నటించి తన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని నట కిరీటి గా బిరుదు తెచ్చుకున్న టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా రాజేంద్ర ప్రసాద్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఆ మధ్య రాజేంద్ర ప్రసాద్ కొడుకు బాలాజీ ప్రసాద్ ని టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం చేయాలని సన్నాహాలు చేశాడట. ఇందులో భాగంగా ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడి ని సంప్రదించి తన కొడుకు బాలాజీ ప్రసాద్ ని హీరో గా పరిచయం చేసే పనులను అప్పగించారట.
దీంతో ఆ దర్శకుడు బాలాజీ ప్రసాద్ ని హీరోగా నటింపచేస్తూ ఓ సినిమాని తెరకెక్కించే పనులను మొదలు పెట్టాడట.ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది.కానీ పలు అనివార్య కారణాల వల్ల సగంలోనే షూటింగ్ పనులను ఆపేశారు.
దీంతో ఏమైందో ఏమోగాని బాలాజీ ప్రసాద్ కూడా ఆ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపకపోవడంతో ఆ సినిమా ఇప్పటికీ షూటింగ్ పనులకు నోచుకోలేదు.
అనంతరం బాలాజీ ప్రసాద్ వ్యాపార రంగంపై దృష్టి సారించి ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు.అయితే ఆ మధ్య రాజేంద్ర ప్రసాద్ బాలాజీ ప్రసాద్ ని మరోమారు హీరో గా ఎంట్రీ ఇచ్చే విషయంపై పునరాలోచన చేయమని చెప్పినప్పటికీ బాలాజీ ప్రసాద్ కి సినిమాలపై ఆసక్తి లేకపోవడంతో సినిమాలకి పూర్తిగా దూరం అయినట్లు సమాచారం.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ బాగానే రాణిస్తున్నాడు. అంతేగాక మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కీలక సభ్యుడిగా ఉంటూ తన సేవలను అందిస్తున్నారు.