ఇంటిలో ఎవరైనా చనిపోతే దుఃఖంలో ఉంటాం.కాబట్టి కొంచెం ఓదార్పు కోసం బంధువులు వారి ఇంటికి తీసుకువెళ్లి బట్టలు పెడితే కొంచెం దుఃఖం తగ్గి ఓదార్పు కలుగుతుంది.
అంతేకాక బంధువులతో కలిసిపోవడం వలన మనస్సు కూడా తేలికపడుతుంది.
అలాగే ఇంటిలో అశుభం జరిగినప్పుడు దేవుని ఆశీర్వాదం కొరకు మరియు శుభం జరగాలని నెల రోజుల లోపు గుడిలో నిద్ర చేయటానికి వెళతారు.
అయితే ఏ గుడికి వెళ్లిన ఇబ్బంది లేదు.దేవాలయం వారి అనుమతితోనే దేవాలయంలోకి ప్రవేశించాలి.దైవ సన్నిధానంలో అశుభ విషయాలను మర్చిపోయి, అంతా భగవంతుని ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పటానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటంలో ఉద్దేశం.