నష్టాలు, బాధల నుండి బయట పాడేసే శక్తి సత్యనారాయణ వ్రతంనకు ఉంది.అందుకే ఈ వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది.
సాదారణంగా ఈ వ్రతాన్ని కార్తీకమాసంలో జరుపుకుంటారు.ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయి మొదట అత్తవారింట అడుగు పెట్టాక మొదట ఈ వ్రతాన్ని చేయించటం అనాదిగా ఆచారంగా ఉంది.
సత్యనారాయణ వ్రతం చేసుకోకపోతే దోషం కలుగుతుందని చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణస్వామి భూమిపై ఆవిర్భవించారని అసాధారణమైన శక్తిని కలిగిన ఉన్నారని భక్తుల విశ్వాసం.
కొత్తగా పెళ్ళైన దంపతులు వారి జీవన ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని త్రిమూర్తి స్వరూపుడైన సత్యనారాయణస్వామిని వేడుకుంటూ వ్రతాన్ని చేస్తారు.
ఈ వ్రతం చేసుకొనే సమయంలో ఆ ఊరిలో వారి అందరిని పిలుస్తారు.
ఆ సమయంలో కొత్త కోడలిని చూసినట్టు అవుతుంది.కొత్త కోడలికి కూడా ఆ ఊరి వారు అందరూ తెలుస్తారు.
దాంతో కొత్తగా వచ్చిన కోడలికి బెరుకు పోయి తొందరగా అందరిలోనూ కలిసిపోతుంది.ఈ వ్రతం సమయంలో తమ కోడలిని అందరికి పరిచయం చేయటంను అత్తమామలు శుభ సూచకంగా భావిస్తారు.