దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ను తరిమి కొట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి.అనేక దేశాలు ఈ విషయంలో ముందున్నాయి.
చైనా, జపాన్, అమెరికాలో కూడా వ్యాక్సిన్ ప్రయోగాలు ఊపందుకున్నాయి.అయితే, ఆయా దేశాల్లో లేనిది… మన దేశంలో జరుగుతున్నది వ్యాక్సిన్ పేరుతో రాజకీయ ప్రచారం ఆయా దేశాల్లో ప్రభుత్వాధినేతలు ఎవరూ కూడా నిరంతరం సమీక్షలు చేయడం లేదు.
శాస్త్రవేత్తలతో నిరంతరం ముచ్చడించడం లేదు.ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి.
కరోనా సూట్లు దరించడం లేదు.
అక్కడి వాతావరణంలోకి చొచ్చుకుపోయి.
ప్రచారం కోసం తహతహలాడడమూ లేదు.కానీ, మన దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కరోనా వ్యాక్సిన్ తయారవుతున్న ల్యాబొరేటరీలకు క్యూ కడుతున్నారు.
సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.శాస్త్రవేత్తలకు ఆయనే కొన్ని సూచనలు చేస్తున్నారు.
ప్రజలకు ఎప్పుడు వ్యాక్యిన్ ఇవ్వాలో కూడా ఆయనే చెబుతున్నారు.దానిని ఎలా భద్రపరచాలో రాష్ట్రాలకు ప్రధానే దిశానిర్దేశం చేస్తున్నారు.
గడిచిన నాలుగు రోజులుగా ప్రధాని మోడీ చేస్తున్న ఈ పనులు భారీ ఎత్తున ప్రధాన మీడియాలో ప్రచారానికి వస్తున్నాయి.మరి దీనికి కారణమేంటి? దీనివెనుక ఏమైనా ఉందా? అంటే.ఖచ్చితంగా ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.ఇతర దేశల్లో లేని విధంగా ప్రధాని జోక్యం చేసుకోవడం మంచిదే అయినా.ఇంతగా ల్యాబొరేటరీలకు వెళ్లి.శాసస్త్రవేత్తలకు సలహాలూ సూచనలు ఇవ్వాల్సిన అవసరం మోడీకి లేకపోయినా.
అయినా ఆయనకు ఏమీ తెలియకపోయినా.ప్రచారం కోసం పాకులాడుతున్నారు.
దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ అజెండా ఉందని..త్వరలోనే అంటే.వ్యాక్సిన్ వచ్చే సమయానికి మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని చెబుతున్నారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్,అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోడీ ఇలా చేస్తున్నారనే వ్యాఖ్యలు జాతీయ మీడియాలోని ఓ వర్గం భావిస్తోంది.మన దేశంలో రాజకీయ నాయకులు ఏం చేసినా.
ఊరికనే చేయరని దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.అదే నిజమైతే.
మోడీని మించిన రాజకీయ పిపాసి మరొకరు ఉండరని విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండడం గమనార్హం.