వినాయకచవితి సందర్భంగా 9 రోజులు పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టి పూజలు చేసి ఆ తర్వాత కాలువలో నిమజ్జనం చేస్తారు.ఈ విధంగా నిమజ్జనం చేయటానికి ఒక కారణం ఉంది.
విగ్రహాన్ని ప్రతిష్ట చేసే సమయంలో యంత్ర ప్రతిష్ఠాపన లేకపోవటమే కారణం.విగ్రహాన్ని కొంత కాలం పాటు అలా ఉంచితే విగ్రహం యొక్క రూపురేఖలు మారవచ్చు.
అది చాలా దోషం.
అలాగే గణపతిని వీధుల్లో ఉరేగించటానికి కూడా ఒక కారణం ఉంది.
ఈ కారణం దేశభక్తికి సంబంధించింది.మొదట వీధుల్లో ఉత్సవాలను నిర్వహించే విధానాన్ని ప్రారంభించింది బాలగంగాధర తిలక్.
స్వాతంత్రం రావాలంటే అందరూ ఐక్యంగా ఉండాలని ముఖ్యంగా హిందువుల అందరిని ఒక తాటి మీదకు తీసుకురావటానికి వాడవాడలా వినాయక పూజలను బహిరంగంగా చేసేలా ప్రోత్సహించారు.అప్పటి నుంచి గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి.