జూన్ 21.అంతర్జాతీయ యోగా దినోత్సవం.2015వ సంవత్సరం నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఏటా 150కి పైగా దేశాల్లో ఉన్న ప్రజలు యోగా డేలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో ఈ సారి కూడా దీన్ని అట్టహాసంగా నిర్వహించారు.రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినీ తారలు, వాళ్లు, వీళ్లు అని తేడా లేకుండా జనాలందరూ యోగా డేలో పాల్గొని తమకు వచ్చిన యోగాసనాలు వేశారు.
అయితే మీకు తెలుసా.? జూన్ 21వ తేదీనే యోగా డేగా ఎందుకు నిర్ణయించారో.? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
ఏడాదిలో ఉండే 365 రోజుల్లోనూ జూన్ 21వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది.అదేమిటంటే… ఈ రోజున సహజంగానే పగటి సమయం ఎక్కువ.ఎందుకంటే ఇదే రోజున దక్షిణాయనం ప్రవేశిస్తుంది.
ఇదే రోజున శివుడు (ఆదిగురువు, ఆది యోగి) యోగా గురించిన విజ్ఞానాన్ని దేవతలకు చెప్పాడట.ఇక ఈ రోజు నుంచి యోగాతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుందట.
ఈ క్రమంలో జూన్ 21వ తేదీని వీటికి ఆరంభంగా భావిస్తారు.అందుకే ప్రధాని మోడీ ఈ అంశాలను ప్రస్తావిస్తూ 27 సెప్టెంబర్ 2014వ తేదీన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రసంగించారు.
కనుక అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలని భారత ప్రతినిధి అశోక్ ముఖర్జీ 11 డిసెంబర్ 2014వ తేదీన అదే ఐక్యరాజ్య సమితిలో ఓ డ్రాఫ్ట్ రిజల్యూషన్ పెట్టారు.
ఈ క్రమంలో సదరు డ్రాఫ్ట్ రిజల్యూషన్కు అనుకూలంగా 177 దేశాలకు చెందిన ప్రతినిధులు ఓటు వేశారు.
జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలనే విషయాన్ని వారు సమర్థించారు.దీంతో ఇక ఆ తరువాత ఏడాది అంటే 2015 నుంచి జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డేను నిర్వహిస్తూ వస్తున్నారు.
అదీ… ఈ తేదీ రోజున యోగా డే పెట్టడం వెనుక ఉన్న అసలు కథ.ఈ క్రమంలోనే ఇదే తేదీన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు యోగా డేను పాటిస్తున్నారు.!
.