ఒకప్పుడు హీరోగా పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చకున్న నటుడు సురేష్. వరుస సినిమాలు చేస్తూ అందరినీ అలరించాడు కూడా.
ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందుకు సాగుతున్నాడు.అప్పట్లో ఆయన చేసే సినిమాలను చూసి శోభన్ బాబు అంతటి హీరో అవుతాడు అని అందరూ అనుకున్నారు.
ఈ విషయాన్ని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల క్రిష్ణ వెల్లడించాడు.పరుచూరి పలుకులు పేరుతో తాజాగా సురేష్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
తాను, సురేష్ కలిసి మరో క్విట్ ఇండియా అనే సినిమా చేసినట్లు వెల్లడించాడు పరుచూరి.ఇందులో వాణీ విశ్వనాథ్ హీరోయిన్ గా నటించినట్లు చెప్పాడు.
చిన్న సినిమా కావడంతో ఖర్చు తగ్గించుకునేందుకు చిన్న రూంలో ఉండేదని చెప్పాడు.అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకునేదన్నాడు.
అదే సమయంలో సురేష్ వాణీ గురించి ఓ విషయం చెప్పాడట.ఈ అమ్మాయితో జాగ్రత్తండీ కేరళలో ఒక వీధిని కొనేసింది.
ఎందుకంటే.తెలుగులో స్టార్ హీరోయిన్గా అవకాశాలు కొట్టేస్తోంది అన్నాడట.
వాస్తవానికి సురేష్ సెట్లో ఉన్నాడంటే నవ్వులే నవ్వులట.కానీ.
తను ఎక్కువగా తమిళ సినిమాలు చేశారు.అవే సినిమాలు వరుసగా తెలుగులోకి చేసి ఉంటే మరో శోభన్బాబు అయ్యేవాడు అని చెప్పాడు.
ఆ తర్వాత సురేష్ తో కలిసి తోడికోడళ్ళు సినిమా చేసినట్లు చెప్పాడు.తొలుత ఈ సినిమాలో వెంకటేష్, రోజా, మీనా, శారద నటించాల్సి ఉండేదని చెప్పాడు.అయితే చిన్నసినిమా కావడంతో వాళ్లు చేయలేని చెప్పారు.అనంతరం ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించినట్లు చెప్పాడు.అయితే మరో క్విట్ ఇండియా సినిమా బాగా ఆడలేదని చెప్పాడు.తోడి కోడళ్లు సినిమా మాత్రం చక్కగా ఆడినట్లు చెప్పాడు.
ఈ సినిమాలో నటించిన వారంతా చిన్న నటులే అయినా.సినిమా చక్కగా వచ్చినట్లు వెల్లడించాడు.
అందుకే ఈ సినిమా జనాలను బాగా ఆకట్టుకున్నట్లు వెల్లడించాడు.ప్రస్తుతం సురేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతున్నాడు.