చలికాలం రాగానే అందరూ వేడి కోసం కమ్ముకుంటారు.ఎండాకాలం, వర్షాకాలం తో పోలిస్తే చలికాలం మనకు ఎంతో అద్భుతంగా, అనుకూలంగా ఉంటుంది.
ఎండా కాలంలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరానికి వేడి ఎక్కువ తగిలి తొందరగా నిరసత్వము పొందుతాము.కాబట్టి చల్లని నీడలో ఉండటానికి ఇష్టపడతాము.
ఇక వర్షాకాలంలో మాత్రం చెప్పలేనిది.వర్షంలో తడవగానే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
అదే చలికాలంలో అయితే చల్లగా ఉంటే ఎండలో ఉంటాం.చలి మంటలు వేసుకుంటాం.దేనినైనా తట్టుకునే శక్తి చలికాలంలో ఉంటుంది.కాబట్టి ఈ రెండు కాలాల కంటే చలికాలం అనుకూలంగా ఉంటుంది.
వాతావరణంలో మార్పు ఉంటుంది.శరీరం పొడిబారడం, ప్రకృతిలో పొగమంచు రావడం, చెట్లన్ని వేరే రంగులోకి మారడం చూస్తుంటాం.
దీంతో చెట్ల ఆకులు రాలిపోతాయి.దీనిని ఆకులూ రాలె కాలంగా పిలుస్తారు.
హేమంత ఋతువు అని కూడా అంటారు.చలికాలంలో రోజు తొందరగా పూర్తవుతుంది.
ఇలా రోజు వచ్చి ఉంటుందో లేదో చీకటి పడుతుంది.ఇలా జరగడానికి ఒక కారణం ఉంది.
చలికాలం, ఎండాకాలం కంటే తక్కువగా ఉంటుంది.ఉత్తర, పశ్చిమ దిశలో వాతావరణంలో మార్పులు ఉంటాయి.దీని వల్లనే ఎండాకాలం ఎక్కువ వెలుగు ఉంటుంది.చలికాలం తొందరగా చీకటి పడుతుంది.
కాగా ఇలా జరగడానికి కొంత కారణం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.భూమి నేరుగా 90 డిగ్రీల కోణంతో కింద కక్ష్యలోకి వెళ్తుంది.
దీంతో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
కొన్నిసార్లు ఉత్తర అర్ధ గోళం సూర్యుడికి దగ్గరగా ఉండగా వేసవికాలం వస్తుంది.
సూర్యుడికి దూరంగా ఉంటే చలికాలం ఏర్పడుతుంది.భూమి తన చుట్టు తాను పరిభ్రమిస్తూ… ఉత్తర ధృవం నుండి పశ్చిమ ధృవానికి తిరుగుతూ ఉంటుంది.
అప్పుడు భూమి కి ఒక వైపు సూర్యుడు కనిపించడంతో పగలు ఏర్పడుతుంది.వ్యతిరేక దిశలో చీకటి ఏర్పడుతుంది.