నిద్ర ఉన్నది శరీరానికి విశ్రాంతినివ్వడం కోసం.నిద్ర సుఖవంతంగా, అడ్డంకులు లేకుండా ఉండాలి.
ఒక్కసారి నిద్రలోకి జారుకున్నామంటే మళ్ళీ 7-8 గంటల దాకా పడుకున్న శవం లాగా అలాగే పడుండాలి.అదే సుఖమైన నిద్ర.
ప్రశాంతమైన నిద్ర.మూత్ర విసర్జన చేయడానికి లేవడం నిద్రకి పెద్ద ఆంటకం.
దీన్ని నొక్టోరియా అని అంటారు.అసలు అర్థరాత్రి అంత మూత్రం ఎందుకు వస్తుంది.
నిద్రమధ్యలో ఈ అడ్డంకేంటి ? దాని వెనుక కారణాలేంటి?
* స్లీప్ అప్నియాతో ఇబ్బందిపడేవారికి ఇలా నిద్రమధ్యలో మూత్రం వస్తుంది.శరీరంలో ఆర్టియల్ నాట్రియూరేటిక్ పెప్టైడ్ విడుదలై, మూత్రాన్ని ఎక్కువ విడుదల చేస్తుంది.
* నిలుచోని ఉన్నప్పుడు గ్రావిటి వలన కాళ్ళలోనే ఉండిపోయిన ఫ్లూడ్స్ ని గుండె సరిగా పంప్ చేయలేదు.అవి పడుకోగానే బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్లిపోయి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి.
* డయాబెటిస్ తో బాధపడే వారికి మూత్రం అనేది నిత్యసమస్య.కిడ్నీల్లో గ్లూకోజు శాతం పెరిగిపోవడంతో మూత్రం అధికంగా వస్తుంది.
* వయసు పెరిగినా కొద్ది, బ్లడర్ కెపాసిటి తగ్గిపోతూ ఉంటుంది.అందుకే వయసు పెరిగినా కొద్ది నిద్ర మధ్యలో మూత్రం వచ్చే అవకాశం పెరిగిపోతుంది.
* రాత్రిపూట మద్యం కాని, కాఫీ కాని తాగితే, నిద్రకు అడ్డంకులు తప్పవు.ఆల్కహాల్, కెఫైన్ .రెండూ అధిక మూత్రానికి కారణమవుతాయి.
* పొట్టలో కొవ్వు ఎక్కువున్నా, ఆ కొవ్వు నొక్టిరియాకి కారణమవుతుంది.