ఏపీకి రాజధాని విశాఖపట్నం అని సీఎం జగన్ ప్రకటించిన దగ్గరి నుంచి రాష్ట్రం లో రాజధాని ప్రకంపనలు మొదలు అయ్యాయి.మూడు రాజధానులు వద్దు అని.
విశాఖ అసలే వద్దు అని అమరావతి మాత్రమే రాజధాని అని తెగేసి చెబుతున్నారు.అమరావతి పేరిట కార్పొరేట్ నేతలు చేసిన యాత్రకు కూడా మద్దతు ఇచ్చారు.
రైతు తన భూమి లాక్కుంటే ధర్నాలు చేయడం షరా మామూలే.కానీ అమరావతి లో మాత్రం రాజదాని భూమి వాడగా మిగిలింది ఆయా రైతులకు ఇచ్చేయాలి అనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నిరసనలు చేయడం మాత్రం విడ్డూరం అని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచ లోనే ఎక్కడ లేనంత గా ఒక్క అమరావతి ఏడు గ్రామాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేసినట్టు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.ఇంతకు విశాఖ ఎందుకు వద్ద అమరావతి ఎందుకు ముద్దు ప్రతి పక్ష పార్టీలు చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.అమరావతి విషయం వచ్చిన ప్రతి సారి.ఒక్క టీడీపీ నే కాకుండా, సీపీఎం, సీపీఐ, బీజేపీ, తో పాటు జన సేన కూడా మద్దతు ఇస్తున్నాయి.అప్పట్లో అమరావతి లో అక్రమంగా భూములు కొన్న వారి లిస్ట్ లో గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ లో నయావాదుల వరకు లిస్ట్ తీసి ప్రెస్ ముందు పెట్టారు.అప్పటికి రెండో తెలుగు సుప్రీం జస్టిస్ గా బాధ్యతలు తీసుకొబోతున్న ఎన్వీ రమణ బందువుల పేర్లు కూడా వినబడ్డాయి.
దాంతో ఆ పేపర్లను పక్కన పెట్టారు.
అమరావతి రాజధానిగా ప్రకటించడం కంటే ముందే.అప్పుడు పొత్తు లో ఉన్న ఈ పార్టీలు అన్ని వేల ఏకరాలు భూములు కొన్నారు అన్నది వాస్తవం.ఇప్పుడు రాజధాని తరలి పోతే తమ భూముల రేట్లు పడిపోతాయి అని భయం తో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటూ ఉన్నారు అని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
విశాఖ కు ప్రపంచ పటం లో చోటుంది.అన్ని వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది.ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ కంపెనీలు ముందుకు వస్తాయని చెబుతున్నారు.మొత్తానికి బిరి రాజకీయాల స్వలాభాల కోసం అన్ని పార్టీలు రాష్ట్ర భవిష్యత్తు ను పక్కన పెడుతున్నాయి అయి విమర్శలకు అంటున్నారు.
ఎవరి స్టాండ్ కరెక్ట్ అన్నది రబోయే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయించాలి.