నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాలో విలన్ పాత్రలో నటి రోజా నటించనుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.
ఈ సినిమాలో లేడీ విలన్ పాత్రలో రోజా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని చిత్ర యూనిట్ భావించింది.
దీంతో ఆమెను ఈ సినిమాలో నటించాలని చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించారని తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో నటించేందుకు రోజా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.దీనికి కారణం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు ఆమెకు ఆఫర్ వచ్చిందట.బాలయ్య సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో నటించడం ఉత్తమమని ఆమె భావించింది.
దీంతో వెంటనే స్టైలిష్ స్టార్ సినిమాకు ఓకే చేసినట్లు, అందుకే బాలయ్య సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది.కాగా ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
కాగా బాలయ్య-రోజాలు గతంలో హీరోహీరోయిన్లుగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.మరోసారి ఈ కాంబోను వెండితెరపై చూడాలనుకున్న ప్రేక్షకుల కల నెరవేరుతుందా లేదా అనేది చూడాలి.
ఏదేమైనా ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందనే మాట వాస్తవం.