మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్యకు సంబంధించి ఎలాంటి వార్తలు వచ్చినా సినీ ప్రియులు తప్పకుండా ఫాలో అవుతున్నారు.అయితే ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై చాలా అనుమానాలు రేకెత్తాయి.
తొలుత త్రిషను ఈ సినిమాకు సెలెక్ట్ చేయగా, షూటింగ్ మొదలు పెట్టకుండానే ఆమె ఈ సినిమా నుండి వెళ్లిపోయింది.
దీంతో టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్కను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ఆమె ఈ సినిమాకు నో చెప్పింది.దీంతో కాజల్ అగర్వాల్ను ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేశారు.కాగా అనుష్క ఎందుకు ఈ సినిమాకు నో చెప్పిందనే విషయంపై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది.
ఈ సినిమా కథ అనుష్కకు నచ్చకపోవడంతో, ఆ విషయాన్ని నేరుగా చెప్పలేక తన రెమ్యునరేషన్ను అమాంతం పెంచేసిందట.దీంతో చిత్ర యూనిట్ వేరే హీరోయిన్ వైపు మొగ్గు చూపారు.
ఇలా తనకు సినిమా కథ నచ్చకపోవడంతోనే అనుష్క ఆచార్యను రిజెక్ట్ చేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉందంటున్నారు చిత్ర వర్గాలు.