ఎంద చాట ….అక్కుమ్ బక్కుమ్ … ఇలాంటి డైలాగులతో బాగా పాపులర్ అయిన తెలుగు కమెడియన్ ఆలీ టాలీవుడ్ లో పాపులర్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు.
అంతే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లో ఆలీకి తప్పనిసరిగా ఏదో ఒక పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.పవన్ కళ్యాణ్ కి ఆలీ సెంటిమెంట్ వీరిద్దరిది ఫెవికాల్ బంధంలా కనిపిస్తుంటుంది.
ఇక రాజకీయాల విషయానికి వస్తే… ఆలీ గత కొంతకాలంగా రాజకీయాల్లోకి వచ్చేందుకు తహతహలాడుతున్నాడు.టీడీపీ తరపున గతంలో ఎన్నికల ప్రచారాల్లో కూడా ఆయన పాల్గొన్నాడు.
అయితే ఆయనకు మాత్రం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాత్రం రాలేదు.ఇక ఆయన మిత్రుడు పవన్ కళ్యాణ్ కొత్తగా పార్టీ పెట్టడంతో ఆలీ జనసేనలోకి వస్తారని… ఆయనకు రాజమండ్రి అసెంబ్లీ స్థానం దక్కుతుంది అని అంతా భావిస్తున్న తరుణంలో ఆయన వైసీపీ అధినేత జగన్ తో కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది.
ఆలీ జగన్ ని కలిశాడని జగన్ ప్రచార వాహనంలో వీరిద్దరూ … గంటకు పైగా చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.అయితే అలీ జగన్ను కలవడంతో జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు అనేక సందేహాలు.అనుమానాలు కలుగుతున్నాయి.కొద్ది నెలల క్రితం జగన్ పవన్ ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో జరిగింది.ఇటువంటి నేపథ్యంలో పవన్ భక్తుడిగా పేరు పొందిన అలీ-జగన్ కలయిక ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది.వాస్తవానికి వైసీపీలో మైనారిటీలకు మంచి గుర్తింపు ఉంటుంది.
గత ఎన్నికల్లో టీడీపీ కంటే ఆ పార్టీనే వాళ్లకు ఎక్కువ సీట్లు కేటాయించింది.ఈ కారణంగానే అలీ వైసీపీ అధినేతతో భేటీ అయ్యారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
ఆలీ – జగన్ భేటీకి సంబంధించి రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కెర్లు కొడుతున్నాయి.ఆలీ వైసీపీలో చేరబోతున్నాడని జనసేనకు హ్యాండ్ ఇవ్వబోతున్నాడని కొత్త చర్చ సాగుతోంది.అయితే ఆలీ మాత్రం తాను మైనారిటీల సమస్యలు చర్చించటానికి వచ్చానని, రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పి వెళ్ళిపోయారు.కానీ ఆలీ రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జగన్ ని అవకాశం కోరినట్టు ఒకవైపు ప్రచారం జరుగుతుంటే… మరోవైపు జగన్ నిన్న కేసుల విచారణ కోసం విశాక నుండి హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చారు.
ఈ సందర్భంలో ఎయిర్ పోర్ట్ బస్ లో వీరిద్దరూ కలిసి ఉండగా బయటకు ఫోటోలు వచ్చాయని… దీనిపై ఇలా రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయని మరో ప్రచారం జరుగుతోంది.